ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అరుణ్ బాలి కన్నుమూశారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 4.30 గంటలకు ముంబయి సబర్బన్లోని నివాసంలో అరుణ్ బాలి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అంకుష్ తెలిపారు. బాలికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా అరుణ్ బాలి నటించిన చివరి చిత్రం ‘గుడ్బై’ అక్టోబర్ 7న థియేటర్లలో విడుదలైంది.
ముందుగా దూస్రా కేవల్ అనే టీవీ షోతో అరుణ్ బాలి తన నటనను ప్రారంభించారు. అనేక టెలివిజన్ ధారావాహికలలో నటించారు. హే రామ్, 3 ఇడియట్స్, సౌగంధ్, రాజు బన్ గయా జెంటిల్మన్, ఖల్నాయక్, సత్య, పీకే, ఎయిర్లిఫ్ట్, కేదార్నాథ్, పానిపట్, పోలీస్వాలా గుండా, లగే రహో మున్నా భాయ్, రెడీ, బర్ఫీ, మన్మర్జియాన్, సామ్రాట్ పృథ్వీరాజ్, లాల్ సింగ్ చద్దా, ఫూల్ ఔర్ అంగార్, రామ్ జేన్ సహా అనేక చిత్రాలలో తన పాత్రలతో అరుణ్ బాలి ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేశారు. అరుణ్ బాలి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY