టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. భారత్-వెస్టిండీస్ల మధ్య మూడు టీ20ల సిరీస్లో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ బోణీ కొట్టింది. లక్ష్య ఛేదనలో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు విండీస్ పై వన్డే సిరీస్ గెలుచుకున్న ఊపులో టీ20 సిరీస్ కూడా విజయంతో ఆరంభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 157/7 స్కోరు చేసింది. నికోలస్ పూరన్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 61) అర్ధ శతకం సాధించాడు. పొలార్డ్ (24 నాటౌట్) ఆకట్టుకున్నాడు. అనంతరం టార్గెట్ ఛేదనకోసం బరిలోకి దిగిన భారత్ 18.5 ఓవర్లలో 162/4 స్కోరు చేసి నెగ్గింది. కెప్టెన్ రోహిత్ శర్మ (40), ఇషాన్ కిషన్ (35), సూర్యకుమార్ (34 నాటౌట్) బ్యాటింగ్ లో సత్తా చాటారు. కాగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (17), రిషభ్ పంత్ (8) విఫలమయ్యారు. బిష్ణోయ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
వెస్టిండీస్
కింగ్ (సి) సూర్య (బి) భువి 4, మేయర్స్ (ఎల్బీ) చాహల్ 31, పూరన్ (సి) కోహ్లీ (బి) హర్షల్ 61, చేజ్ (ఎల్బీ) బిష్ణోయ్ 4, పావెల్ (సి) వెంకటేష్ (బి) బిష్ణోయ్ 2, హుసేన్ (సి అండ్ బి) దీపక్ 10, పొలార్డ్ (నాటౌట్) 24, స్మిత్ (సి) రోహిత్ (బి) హర్షల్ 4; ఎక్స్ట్రాలు: 17; మొత్తం: 20 ఓవర్లలో 157/7
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-31-1, దీపక్ చాహర్ 3-0-28-1, హర్షల్ పటేల్ 4-0-37-2, చాహల్ 4-0-34-1, బిష్ణోయ్ 4-0-17-2, వెంకటేష్ అయ్యర్ 1-0-4-0.
భారత్
రోహిత్ (సి) స్మిత్ (బి) చేజ్ 40, ఇషాన్ కిషన్ (సి) అలెన్ (బి) చేజ్ 35, కోహ్లీ (సి) పొలార్డ్ (బి) అలెన్ 17, పంత్ (సి) స్మిత్ (బి) కాట్రెల్ 8, సూర్యకుమార్ (నాటౌట్) 34, వెంకటేష్ (నాటౌట్) 24; ఎక్స్ట్రాలు: 4; మొత్తం: 18.5 ఓవర్లలో 162/4
బౌలింగ్: కాట్రెల్ 4-0-35-1, షెఫర్డ్ 3-0-24-0, ఓడియన్ స్మిత్ 2-0-31-0, హుసేన్ 4-0-34-0, చేజ్ 4-0-14-2, అలెన్ 1.5-0-23-1.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ