అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు సంబంధించి జనవరి 2021 నెల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) “ప్లేయర్ ఆఫ్ ది మంత్” అవార్డు అందిస్తుంది. మెన్ మరియు ఉమెన్ క్రికెటర్ల విభాగంలో ఈ అవార్డును ఇస్తున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును భారత్ బౌలింగ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్ తో ఫిబ్రవరి నెలలో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ లో 24 వికెట్లు తీసి, బ్యాటింగ్ లో కూడా ఓ సెంచరీతో అశ్విన్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ అవార్డ్ రేసులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, విండీస్ ఆటగాడు కైల్ మేయర్స్ ఉన్నప్పటికీ ఓటింగ్లో అశ్విన్ ముందంజలో ఉండి ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.
మరోవైపు ఫిబ్రవరి నెలకు ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఇంగ్లాండ్ క్రికెట్ క్రీడాకారిణి టామీ బ్యూమాంట్ గెలుచుకున్నారు. ఓటింగ్ లో నాట్ సైవర్ (ఇంగ్లాండ్), బ్రూక్ హిల్లాడే (న్యూజిలాండ్) కంటే ముందంజలో నిలిచి ఆమె ఈ అవార్డు దక్కించుకున్నారు.
24 wickets in February 📈
A match-defining hundred vs England 💥
ICC Men’s Player of the Month ✅Congratulations, @ashwinravi99! pic.twitter.com/FXFYyzirzK
— ICC (@ICC) March 9, 2021
Three ODIs in February. 231 runs. 231 average 🤯
She’s the new number 1️⃣ women’s ODI batter and now @Tammy_Beaumont has another individual accolade to her name 🌟
Congratulations, Tammy! 👏 pic.twitter.com/770bgYCr7v
— ICC (@ICC) March 9, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ