అక్టోబర్ 12, సోమవారం నాడు నోబెల్ కమిటీ అర్థశాస్త్రంలో ఇద్దరికీ నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ ఏడాది అర్ధశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని అమెరికా ఆర్థికవేత్తలు పాల్ ఆర్.మిల్గ్రోమ్, రాబర్ట్ బి.విల్సన్లను దక్కించుకున్నారు. వేలం సిద్ధాంతంలో మెరుగుదల, కొత్త వేలం ప్రక్రియల ఆవిష్కరణలకు గానూ వీరిని ఎంపిక చేసినట్టు కమిటీ ప్రకటించింది. 2020 సంవత్సరానికి గానూ భౌతిక శాస్త్రంలో రోజర్ పెన్రోస్, రీన్హార్డ్ జెంజెల్, ఆండ్రియా ఘెజ్ లు అనే ముగ్గురు పరిశోధకులు, అలాగే రసాయన శాస్త్రంలో ఇమ్మాన్యూయెల్ చార్పెంటీర్ మరియు జెన్నీఫర్ ఏ డౌడ్నా అనే ఇద్దరు మహిళా పరిశోధకులు నోబెల్ పురస్కారానికి ఎంపిక అయిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu