కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను పూర్తీ ఆరోగ్యంగా ఉన్నానని, ఏ వ్యాధితోనూ బాధపడడం లేదని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
“నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, ఏ వ్యాధితో బాధపడడం లేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొంతమంది నా ఆరోగ్యం గురించి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. వాస్తవానికి చాలా మంది నా మరణం కోసం కూడా ట్వీట్ చేశారు. కరోనావైరస్ మహమ్మారితో దేశం పోరాడుతుంది. దాదాపు 60,000 మంది ప్రజలను ప్రభావితం చేయగా, 1,900 మందికి పైగా మృతి చెందారు. ఈ సమయంలో హోంమంత్రిగా నా విధులను నిర్వర్తించడంలో బిజీగా ఉన్నందున ఈ పుకార్లపై దృష్టి పెట్టలేదు. గత రెండు రోజులుగా లక్షలాది మంది బిజెపి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేసినందున ఈ రోజు నేను వారికీ విషయం చెప్పాలనే స్పందిస్తున్నా. నా ఆరోగ్యం గురించి ఇలాంటి ఊహాగానాలు నన్ను మరింత బలోపేతం చేస్తాయి. ఇలాంటి అసత్య ప్రచారాలు మానేయండి. నా పనిని నన్ను చేసుకోనివ్వండని నేను అభ్యర్థిస్తున్నాను. అలాగే మీరూ మీ పని చూసుకోండి. నా ఆరోగ్యం గురించి ఆరా తీసినందుకు బీజేపీ శ్రేయోభిలాషులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. ఈ పుకార్లను వ్యాప్తి చేసిన వారిపై నాకు ఎలాంటి ద్వేషం లేదని” హోం మంత్రి అమిత్ షా ట్విట్టర్ లో ప్రకటన విడుదల చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu