మూడో విడత లాక్డౌన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం మే 4 వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యపాన నిషేధం హామీలో భాగంగా మద్యం దుకాణాలను తగ్గిస్తూ మే 9, శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 13 శాతం దుకాణాలను తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో, దుకాణాల సంఖ్య 2934కి తగ్గిపోయింది.
మే నెల చివరి నుంచి రాష్ట్రంలో కేవలం 2934 మద్యం దుకాణాలు మాత్రమే తెరవనున్నట్టు తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం దుకాణాలను తొలగించగా, తాజా నిర్ణయంతో మొత్తం 33 శాతం తగ్గించినట్లయింది. దీంతో దుకాణాల సంఖ్య కూడా 4380 నుంచి 2934కి పడిపోయింది. అదేవిధంగా బార్లను కూడా 40 శాతం మేరకు కుదించి 530కి తగ్గించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu