దేశవ్యాప్తంగా 2022-23 మార్కెట్ సీజన్లో 17 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) సమావేశమై పంటల మద్దతు ధర పెంపుకు ఆమోదం తెలిపింది. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం, పంటల వైవిధ్యతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2022-23లో కనీస మద్ధతు ధరలను పెంచినట్టు పేర్కొన్నారు.
ఖరీఫ్ సీజన్ కై కనీస మద్దతు ధర పెరిగిన పంటలివే:
- వరి (కామన్) – కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.100 పెంపు – ధర రూ.2040 గా నిర్ణయం
- వరి (గ్రేడ్-ఏ) పై రూ.100 పెంపు – ధర రూ.2060
- పత్తి (మీడియం) పై రూ.354 పెంపు – ధర రూ.6080
- పత్తి (లాంగ్) పై రూ.355 పెంపు – ధర రూ.6380
- జొన్న (హైబ్రిడ్) పై రూ.232 పెంపు – ధర రూ.2970
- జొన్న (మాల్ దండి) పై రూ.232 పెంపు – ధర రూ.2990
- సజ్జలు పై రూ.100 పెంపు – ధర రూ.2350
- రాగులు పై రూ.201 పెంపు – ధర రూ.3578
- మొక్కజొన్నపై రూ.92 పెంపు – ధర రూ.1962
- కందులుపై రూ.300 పెంపు – ధర రూ.6600
- పెసలుపై రూ.480 పెంపు – ధర రూ.7755
- మినుములుపై రూ.300 పెంపు – ధర రూ.6600
- వేరుశనగపై రూ.300 పెంపు – ధర రూ.5850
- పొద్దుతిరుగుడుపై రూ.385 పెంపు – ధర రూ.6400
- సోయాబీన్ (యెల్లో)పై రూ.350 పెంపు – ధర రూ.4300
- నువ్వులుపై రూ.523 పెంపు – ధర రూ.7830
- వెర్రి నువ్వులు/ఒడిసలు/నిజేర్ సీడ్ పై రూ.357 పెంపు – ధర రూ.7287.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY