మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో డిసెంబర్ 25, శనివారం నాడు 1485 కరోనా కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 66,56,240 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,41,416 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 796 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 65,02,039 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.68 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.12 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 9,102 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి మహారాష్ట్రలో 6,83,53,269 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ