దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారికి వారితో పాటుగా మే 1 నుంచి మూడో దశలో భాగంగా 18-44 ఏళ్ల వారికి కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులు, త్వరలో అందించబోయే డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 17.49 కోట్లకుపైగా (17,49,57,770) కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా అందించినట్టు తెలిపారు. ఇందులో వ్యాక్సిన్ వృధాతో కలిపి మే 8, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 16,65,49,583 డోసులను వినియోగించినట్టు ప్రకటించారు.
ఇక అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ఈ రోజు ఉదయం 8 గంటల వరకు 84 లక్షలకుపైగా (84,08,187) కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. అలాగే రాబోయే 3 రోజుల్లో మరో 53 లక్షలకుపైగా (53,25,000) వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వద్ద 9,88,903 కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో 1,28,829, తెలంగాణలో 3,05,150 వ్యాక్సిన్ డోసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ