ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్ మొదటగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూడగా, ఇప్పుడు దాదాపు 100 దేశాలలో కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, యూకేలలో ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రతతో వేలసంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. కాగా భారత్ లో కూడా ఒమిక్రాన్ వ్యాప్తి రోజురోజుకి మరింత ఆందోళన కలిగిస్తుంది. దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. మొత్తం 12 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైయినట్టు తెలిపారు. అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 54 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కాగా మొత్తం 200 బాధితుల్లో ఇప్పటికే 77 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు.
దేశంలో ఒమిక్రాన్ కేసుల వివరాలు (200):
- మహారాష్ట్ర – 54
- ఢిల్లీ – 54
- తెలంగాణ – 20
- కర్ణాటక – 19
- రాజస్థాన్ – 18
- కేరళ – 15
- గుజరాత్ – 14
- ఉత్తర్ ప్రదేశ్ – 2
- ఆంధ్రప్రదేశ్ – 1
- చండీఘర్ – 1
- తమిళనాడు – 1
- వెస్ట్ బెంగాల్ – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ