సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. ప్రస్తుతం సీజే గా ఉన్న జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఈ ప్రతిపాదనను కేంద్రం పరిశీలించిన అనంతరం రాష్ట్రపతి కార్యాలయానికి చేరనుంది. రాష్ట్రపతి ఆమోదించి ఉత్తర్వులు జారీ చేస్తే, సుప్రీంకోర్టు కొత్త సీజే ఎంపిక ప్రక్రియ పూర్తికానుంది. .
సుప్రీంకోర్టులో ప్రస్తుత సీజే జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే తరవాత జస్టిస్ ఎన్వీ రమణ అత్యంత సీనియర్ న్యాయమూర్తి. జస్టిస్ ఎన్వీ రమణ 1957 ఆగస్ట్ 27న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో జన్మించారు. 1983లో ఆయన న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలు పెట్టారు. జూన్ 2000 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అలాగే ఫిబ్రవరి 2014లో పదోన్నతి భాగంగా సుప్రీంకోర్టుకు వెళ్లేముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఎంపిక పక్రియ అనంతరం ఏప్రిల్ 24 వ తేదీన జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆగస్టు 26, 2022 వరకు ఆయన చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ