దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 16,051 కరోనా కేసులు, 206 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,28,38,524 కు చేరుకోగా, మరణాల సంఖ్య 5,12,109 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, మిజోరాం వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 37,901 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,21,24,284 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.33 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది. దేశంలో ప్రస్తుతం 2,02,131 (0.47%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (ఫిబ్రవరి 20 (8am)–ఫిబ్రవరి 21 (8am)):
- కేరళ – 5,427
- మహారాష్ట్ర – 1,437
- రాజస్థాన్ – 1,022
- కర్ణాటక – 1,001
- మధ్యప్రదేశ్ – 950
- తమిళనాడు – 949
- ఢిల్లీ – 662
- ఉత్తర్ ప్రదేశ్ – 613
- హర్యానా – 534
- మిజోరాం – 517
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ