కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సెప్టెంబర్ 28న పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీ బాధ్యతలు తీసుకోవడం, సిద్ధూ రాజీనామా అనంతరం పంజాబ్ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటుకున్నాయి. కాగా తాజాగా పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్టు సిద్ధూ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నా రాజీనామాను వెనక్కి తీసుకున్నాను. అలాగే రాష్ట్రంలో కొత్త అడ్వకేట్ జనరల్ను నియమించి కొత్త ప్యానెల్ వచ్చే రోజున, నా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తాను. నాది వ్యక్తిగత అహం కాదు. రాష్ట్రానికి జరిగే మేలు కోసమే మాట్లాడతాను. పంజాబ్ సీఎం చరణ్జిత్ చన్నీతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. ఏది చేసినా పంజాబ్ కోసమే” అని సిద్ధూ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ