పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సమావేశాల్లో లేవనెత్తే అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన గురువారం నాడు ఆమె నివాసంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరగనుంది. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పార్లమెంట్ లో గళం వినిపించేలా ఈ సమావేశంలో ప్రణాళికలు రూపొందించనున్నట్టు తెలుస్తుంది. ద్రవ్యోల్బణం, పెరిగిన పెట్రోల్, డీజీల్ రేట్లు, రైతుల సమస్యలు, పెగాసిస్ అంశం సహా దేశంలో కరోనాతో మరణించిన వారి సభ్యులకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలనే డిమాండ్ కూడా పార్లమెంట్ లో లేవనెత్తాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ