నేడు భేటీ కానున్న కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక‌ అడ్వైజరీ కమిటీ, కీలక అంశాలపై చర్చ

Congress, Congress Party Advisory Committee, Congress Party Advisory Committee To Meet Today, Mango News Telugu, national news, national political news, Sonia Gandhi, Sonia Gandhi To Meet Advisory Committee Members, Virtual meeting of Sonia Gandhi, Virtual meeting of Sonia Gandhi advisory committee

దేశ రాజకీయాల్లో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. వరుసగా పలు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పాటుగా, పార్టీలో అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఎదుర్కొంటుంది. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో కూడా పార్టీ పేలవ ప్రదర్శనతో నాయకుల్లో, కార్యకర్తల్లో అసంతృప్తి నెలకుంది. పార్టీ ప్రక్షాళన, సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టాలని పలువురు కీలక నాయకులు అధిష్టానానికి సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాచరణ విషయాలపై అధ్యక్షురాలు సోనియా గాంధీకి సహాయపడటానికి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక‌ అడ్వైజరీ కమిటీ మంగళవారం సాయంత్రం భేటీ కానుంది.

బీహార్ ఎన్నికల ఓటమి, కీలక నాయకులు విమర్శల తర్వాత ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎకె ఆంటోనీ, రణదీప్ సింగ్ సుర్జేవాలా, అహ్మద్ పటేల్, అంబికా సోని, ముకుల్ వాస్నిక్, కెసి వేణుగోపాల్ ఉన్న ఈ కమిటీలో అహ్మద్ పటేల్ మినహా మిగిలిన వారంతా సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు ఈ కమిటీ సంస్థాగత విషయాలపైనే కీలకంగా చర్చించే అవకాశం ఉన్నందున బీహార్ ఎన్నికల ఓటమి అంశం ఎజెండాలో లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 14 =