తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నాడు 38,245 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 952 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,58,828 కి చేరుకుంది. ఈ వైరస్ వలన మరో ముగ్గురు మరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1410 కి పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 1602 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు రికవరీ అయిన వారి సంఖ్య 2,43,686 కు చేరుకుంది. ప్రస్తుతం 13,732 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికి 49,29,974 కరోనా పరీక్షలు నిర్వహించడంతో, ప్రతి పది లక్షల జనాభాకు 1,30,391 పరీక్షలు నిర్వహించినట్లయింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ