జనవరి 26 నుంచి కాంగ్రెస్ ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ ప్రారంభం, లోగో విడుదల చేసిన నేతలు

CongressLeaders launched,Congress Haath Se Haath Jodo Abhiyan,Haath Se Haath Jodo Abhiyan,Haath Se Haath Jodo Abhiyan from January 26,Haath Se Haath Jodo Abhiyan logo released,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

కాంగ్రెస్ పార్టీ జనవరి 26వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో శనివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ కు సంబంధించిన లోగోను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. జనవరి 26 నుంచి రెండు నెలల పాటు హాత్ సే హాత్ జోడో అభియాన్ ప్రచారం జరగనుంది. ఈ సందర్భంగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జిషీట్ ను కూడా కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు.

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’ చివరి దశకు చేరుకుంది. 2022, సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర, 2023, జనవరి 30వ తేదీన జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్‌లో ముగియనుంది. జనవరి 30న శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించడం, భారీ బహిరంగ సభతో యాత్రను ముగించనున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వెంటనే ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రారంభిస్తుంది.

ఈ సందర్భంగా ఎంపీ జైరాం రమేష్ మాట్లాడుతూ, భారత్ జోడో యాత్ర అనేది ఒక సైద్ధాంతిక ఉద్యమం అయితే, హాత్ సే హాత్ జోడో అభియాన్ అనేది మోదీ ప్రభుత్వ వైఫల్యాలను హైలైట్ చేయడానికి మరియు యాత్ర సందేశాన్ని ప్రతి భారతీయుడికి తీసుకెళ్లడానికి ఇంటింటికీ ఎన్నికల ప్రచారమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ, రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర సందేశాన్ని సామాన్యులకు చేరేలా ఇంటింటికి ప్రచారం చేసేందుకు హాత్ సే హాత్ జోడో అభియాన్ ప్రచారాన్ని ప్రారంభింస్తున్నామని అన్నారు. మోదీ ప్రభుత్వంపై చార్జిషీట్‌ విడుదలపై స్పందిస్తూ, దేశంలో ప్రజలు పడుతున్న బాధలను కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుందన్నారు. అవసరమైతే బీజేపీ లేదా ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయా రాష్ట్రాల్లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు (పీసీసీలు) కూడా ఛార్జిషీట్లు తయారుచేస్తాయని కేసీ వేణుగోపాల్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =