దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,016 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 10, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,63,968కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో ముగ్గురు మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,514 కి పెరిగింది. ఇక నవంబర్ 9న 1,52,750 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.67 శాతంగా నమోదైంది.
దేశంలో 13,187 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.78 శాతం:
దేశంలో ప్రస్తుతం 13,187 (0.03%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 1,385 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,20, 267 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.78 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు కొంత ఎక్కువగా నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE