కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ గురువారం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మంత్రి భారతి పవార్ స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ‘‘ఈ రోజు నాకు కోవిడ్-19 టెస్టులో పాజిటివ్ గా తేలింది. అందుకే, నేను ఇంట్లో క్వారంటైన్లో ఉన్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలుస్తున్న వారందరూ తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోండి. అలాగే, అందరూ కరోనా జాగ్రత్తలను పాటించండి’’ అని కేంద్ర మంత్రి డాక్టర్ భారతి ట్విట్టర్లో చెప్పారు. దేశంలో గత 24 గంటల్లో గురువారం 90,928 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రిపోర్ట్స్ ప్రకారం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 2,85,401కు పెరిగాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ