కరోనా మహమ్మారి వలన దేశంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సెలెబ్రిటీలు కన్నుమూశారు. ఈ క్రమంలో హిందీ టీవీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ యువ నటి దివ్య భట్నాగర్(34) కూడా కరోనాతో మృతి చెందారు. గతకొన్ని రోజులుగా ముంబయిలోని సెవెన్హిల్స్ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న దివ్య భట్నాగర్ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్టు ఆమె సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. యే రిష్టా క్యా కెహ్లతా హై, సంస్కార్, ఉడాన్, జీత్ గయి తోహ్ పియా మోరే, విష్ మరియు సావారే సబ్కో ప్రీటో వంటి షోలతో ఆమె ప్రేక్షకులను అలరించారు. దివ్య భట్నాగర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు, సహ నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ