దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 6 వేలలోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 5,108 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 14, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,10,057 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.44 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 31 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,28,216 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, గుజరాత్, ఒడిశా, తెలంగాణ, అస్సాం, ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 45,749 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.71 శాతం:
ఇక సెప్టెంబర్ 13, మంగళవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 89.02 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ 13న 3,55,231 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం 45,749 (0.1%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 5,675 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,39,36,092 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.71 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY