భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 20, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 17,265కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే కొత్తగా 1533 కేసులు, 36 మరణాలు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్యలో ఇప్పటి వరకు 2,547 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఈ వైరస్ వలన 543 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 14,175 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను మే 3 వ తేదీ వరకు పొడిగిస్తునట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే 4,203 కేసులు నమోదయ్యాయి. వీరిలో 507 మంది కోలుకోగా, 223 మంది మృతిచెందారు. ఢిల్లీలో 2,003, గుజరాత్ 1,743 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 4,203
- ఢిల్లీ – 2,003
- గుజరాత్ – 1,743
- రాజస్థాన్ – 1,495
- తమిళనాడు – 1,477
- మధ్యప్రదేశ్ – 1,407
- ఉత్తర ప్రదేశ్ – 1,100
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu