తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు లక్షకు చేరువయ్యాయి. జూలై 2, గురువారం నాడు కొత్తగా 4343 కరోనా కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 98,392 కి చేరింది. అలాగే చెన్నై నగరంలో కొత్తగా 2027 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 62598 కేసులు నిర్ధారణ అయ్యాయి.
గత 24 గంటల్లో నమోదైన 57 కరోనా మరణాలతో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1321 కి చేరింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 3095 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 56021 కి చేరింది. ప్రస్తుతం 41047 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu