తెలంగాణలో కరోనా తీవ్రత: కొత్తగా 1213 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు

Telangana Covid-19 Updates: 1213 New Positive Cases and 8 Deaths Reported in a Single Day

తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో అత్యధికంగా ఇన్నికేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో జూలై 2, గురువారం నాటికీ మొత్తం కేసుల సంఖ్య 18,570 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం నాడు 5356 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 275 కి పెరిగినట్టు తెలిపారు.

ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న987 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 9069 కి చేరింది. ప్రస్తుతం 9226 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 998, మేడ్చల్ లో 54, రంగారెడ్డి లో 48, ఖమ్మం లో 18, వరంగల్ రూరల్ లో 10, వరంగల్ అర్బన్ లో 9 నమోదయ్యాయి

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =