దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 8,875 సెషన్స్ లో 3,58,473 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో ఫిబ్రవరి 7, ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 57.75 లక్షలకు పైగా (57,75,322) మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. వీరిలో 53,04,546 హెల్త్ కేర్ వర్కర్స్, 4,70,776 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ ఉన్నారు.
ప్రపంచంలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అత్యధిక డోసులు వ్యాక్సిన్ పంపిణి జరిపిన దేశాల్లో అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్ తర్వాత భారత్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి 2,99,649 మంది, తెలంగాణలో 2,09,104 మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ వేశారు.
రాష్ట్రాల వారీగా కరోనా వ్యాక్సినేషన్ వివరాలు:
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ