ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఏపీకి మరో 4 లక్షల 80 వేల కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. ముందుగా పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. అనంతరం వాటిని రోడ్డు మార్గంలో గన్నవరంలోని రాష్ట్ర వ్యాక్సిన్ నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కేటాయింపు ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలకు తరలిస్తున్నారు. తాజాగా ఈ వ్యాక్సిన్ డోసుల రాకతో రాష్ట్రంలో సెకండ్ డోస్ వ్యాక్సిన్ పంపిణీ మరింత సాఫీగా సాగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ