విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన మొదలైంది. జనవరి 27న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ప్రైవేటీకరణ ద్వారా పూర్తి నిర్వహణ నియంత్రణతో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమ (ఆర్ఐఎన్ఎల్)లో భారత ప్రభుత్వ వాటాను 100% వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడానికి సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. దీంతో విశాఖలో కార్మికుల ఆందోళన మొదలైంది. కేంద్రం వెంటనే ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు విశాఖలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అలాగే పలు పార్టీల నాయకులు కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తామని ప్రకటన చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నాడు లేఖ రాశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దంటూ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఆభరణమైన ఈ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వం కాపాడుకుంటుందని ప్రధాని మోదీకి రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ