భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 29, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 31,332 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1897 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 73 మంది మరణించారు. దేశంలో మరణాలు సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1007 కి చేరింది. మరోవైపు కరోనా బాధితుల్లో 7696 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 22629 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే 9,318 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1388 మంది కోలుకోగా, 400 మంది మృతిచెందారు. దేశంలో అత్యధిక కరోనా మరణాలు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత గుజరాత్ లో అత్యధికంగా 3,774, ఢిల్లీలో 3,314 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 9,318
- గుజరాత్ – 3,774
- ఢిల్లీ – 3,314
- రాజస్థాన్ – 2,387
- మధ్యప్రదేశ్ – 2,383
- తమిళనాడు – 2,058
- ఉత్తర ప్రదేశ్ – 2,053
- ఆంధ్రప్రదేశ్ – 1,259
- తెలంగాణ – 1,009
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]