దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 14,821 కరోనా పాజిటివ్ కేసులు, 445 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో జూన్ 22, సోమవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,25,282 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా కేసులు ఎక్కువుగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే మహారాష్ట్రలో 3870, ఢిల్లీలో 3000 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు.
అలాగే కొత్తగా నమోదైన 445 మరణాలతో కలిపి కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 13,699 కి చేరింది. మొత్తం కరోనా బాధితుల్లో 2,37,195 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 1,75,387 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ 4వ స్థానంలో, కరోనా మరణాల్లో 8వ స్థానంలో నిలిచింది.
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
(As on 22 June, 2020, 08:00 AM)▶️ Confirmed cases: 425,282
▶️ Active cases: 174,387
▶️ Cured/Discharged/Migrated: 237,196
▶️ Deaths: 13,699#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHIVia @MoHFW_INDIA pic.twitter.com/hnPjEoAEEm
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 22, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu