భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతూనే ఉంది. ఏప్రిల్ 23, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 21,393 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం కరోనా బాధితుల్లో ఇప్పటి వరకు 4,257 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఈ వైరస్ వలన 681 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 16,454 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే 5,649 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 789 మంది కోలుకోగా, 269 మంది మృతిచెందారు. ఇక గుజరాత్ లో 2,407, ఢిల్లీలో 2,248 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 5,649
- గుజరాత్ – 2,407
- ఢిల్లీ – 2,248
- రాజస్థాన్ – 1,935
- తమిళనాడు – 1,629
- మధ్యప్రదేశ్ – 1,587
- ఉత్తర ప్రదేశ్ – 1,449
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu