రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 20,160 కు చేరుకుంది. జూలై 7, మంగళవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7,19,665 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 22,252 కరోనా పాజిటివ్ కేసులు, 467 కరోనా మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో రష్యాను ను దాటేసిన భారత్ 3 వ స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 7, ఉదయం 8 గంటల వరకు) :
దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 7,19,665
కొత్తగా నమోదైన కేసులు (జూలై 6 – జూలై 7 (8AM-8AM) : 22,252
నమోదైన మరణాలు : 467
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 4,39,948
యాక్టీవ్ కేసులు : 2,59,557
మొత్తం మరణాల సంఖ్య : 20,160
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu