భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 27, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 27,892 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1396 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 48 మంది మరణించారు. ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 877 కి చేరింది. మరోవైపు కరోనా బాధితుల్లో 6185 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 20,835 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే 8,068 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 26, ఆదివారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో కొత్తగా 440 కేసులు నమోదయ్యాయి. వీరిలో 1188 మంది కోలుకోగా, 342 మంది మృతిచెందారు. దేశంలో అత్యధిక కరోనా మరణాలు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత గుజరాత్ లో అత్యధికంగా 3,301, ఢిల్లీలో 2,918 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 8,068
- గుజరాత్ – 3,301
- ఢిల్లీ – 2,918
- రాజస్థాన్ – 2,221
- మధ్యప్రదేశ్ – 2,090
- తమిళనాడు – 1,885
- ఉత్తర ప్రదేశ్ – 1,873
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]