దేశంలో ఏప్రిల్ 27, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,892 కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం తదితర అంశాలపై చర్చించేందుకు మరోసారి రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఏప్రిల్ 27, సోమవారం ఉదయం 10 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది.
ఈ సమావేశంలో ఏప్రిల్ 20 తర్వాత లాక్డౌన్ లో రాష్ట్రాలు ఇచ్చిన మినహాయింపులు, ఆర్ధిక పరిస్థితులు, కంటైన్మెంట్ జోన్ల వివరాలపై కూడా సమీక్ష జరపనున్నారు. అలాగే లాక్డౌన్ను దశలవారీగా ఎత్తివేసే అంశంపై కూడా సీఎంలతో మోదీ చర్చించే అవకాశం ఉంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మే 3 తర్వాత కూడా లాక్డౌన్ పొడిగింపు అంశంపై కొన్ని రాష్ట్రాలు ప్రధాని మోదీ కి వివరణ ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తుంది. మరికొన్ని రాష్ట్రాలు దశల వారీగా లాక్డౌన్ను ఎత్తివేయాలని, అందుకు సంబంధించిన నిబంధనల రూపకల్పనపై మోదీని కోరనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]