ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జూన్ 12, శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,97,535 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో బ్రిటన్ ను దాటేసి భారత్ 4వ స్థానంలో నిలిచింది. కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు దేశంలో 8,498 మంది మరణించారు. మొత్తం కరోనా బాధితుల్లో 1,47,195 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 1,41,842 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో 10000 కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో 10000 కి పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర : 1,01,141
- తమిళనాడు : 40698
- ఢిల్లీ : 34687
- గుజరాత్ : 22562
- ఉత్తరప్రదేశ్ : 12088
- రాజస్థాన్ : 11930
- పశ్చిమ బెంగాల్ : 10244
- మధ్యప్రదేశ్ : 10241
దేశంలో 5000 కి పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలు:
- కర్ణాటక : 6516
- బీహార్ : 6043
- హర్యానా : 6334
- ఆంధ్రప్రదేశ్ : 5636
దేశంలో 5000 లోపు కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలు:
- తెలంగాణ: 4320
- ఒడిశా: 3498
- అస్సాం : 3499
- పంజాబ్ : 2986
- కేరళ : 2323
- ఉత్తరాఖండ్: 1692
- జార్ఖండ్ : 1607
- ఛత్తీస్ ఘడ్: 1398
- త్రిపుర: 924
- హిమాచల్ ప్రదేశ్ : 481
- గోవా : 463
- మణిపూర్ : 385
- నాగాలాండ్ : 164
- మిజోరం : 104
- అరుణాచల ప్రదేశ్ : 80
- మేఘాలయ : 44
- సిక్కిం : 27
కేంద్రపాలిత ప్రాంతాలు:
- జమ్మూ కశ్మీర్ – 4730
- చండీఘర్ – 332
- పుదుచ్చేరి – 163
- లడఖ్ – 135
- అండమాన్ నికోబార్ – 38
- దాద్రానగర్ హవేలీ – 30
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu