మహారాష్టలో మరోసారి లాక్డౌన్ విధించడం లేదని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఈ రోజు స్పష్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎంఓ కార్యాలయం అధికారిక ఖాతా నుంచి ట్వీట్ చేసింది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరుకోవడంతో రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తారంటూ వదంతులు వస్తున్న నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ థాకరే స్పష్టత నిచ్చారు. అయితే రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు గుంపులుగా గుమికూడకూడదని, అన్ని చోట్ల భౌతిక దూరం పాటించాలని సీఎం ఉద్ధవ్ థాకరే సూచించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజల్ని ఆయన అభ్యర్థించారు.
మరోవైపు జూన్ 12, శుక్రవారం నాటికి మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,141 కి చేరింది. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 3493 కొత్త కేసులు నమోదవగా, కరోనా వలన 127 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య కూడా 3717 కి చేరింది. మొత్తం కేసుల్లో 47,796 మంది కోలుకోగా, ప్రస్తుతం 49,628 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
The lockdown has not been reimposed. CM Uddhav Balasaheb Thackeray has appealed to the people to refrain from crowding. He has earnestly requested them to follow the Govt’s instructions and take necessary precautions to stay safe and take care.
— CMO Maharashtra (@CMOMaharashtra) June 12, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu