భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవ్రత రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 5242 కరోనా పాజిటివ్ కేసులు, 157 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఒకేరోజు ఇంతపెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. మే 18, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 96,169 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3029 కి చేరింది. కరోనా బాధితుల్లో 36,824 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 56,316 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిన దేశాల్లో చైనాను దాటి భారత్ 11 వ స్థానంలో నిలిచింది.
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా వైరస్ అధిక ప్రభావం చూపుతుంది. మహారాష్ట్రలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 33,053 కు చేరగా, 1,198 మంది మరణించారు. మహారాష్ట్ర తర్వాత గుజరాత్ లో అత్యధికంగా 11,380, తమిళనాడులో 11,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 33,053
- గుజరాత్ – 11,380
- తమిళనాడు – 11,224
- ఢిల్లీ – 10,005
- రాజస్థాన్ – 5,342
- మధ్యప్రదేశ్ – 4,977
- ఉత్తర ప్రదేశ్ – 4,464
- పశ్చిమబెంగాల్ – 2,677
- ఆంధ్రప్రదేశ్ – 2,432
- పంజాబ్ – 1,964
- తెలంగాణ – 1,551
- బీహార్ – 1,326
- జమ్మూ కశ్మీర్ – 1,183
- కర్ణాటక – 1,147
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]