దేశంలో మళ్ళీ కరోనా వ్యాప్తి ప్రభావం క్రమంగా పెరుగుతుంది. దీంతో రోజువారీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 16,764 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 3,48,38,804 కు చేరుకుంది. అలాగే కరోనాతో 220 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,81,080 కు పెరిగింది. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, జార్ఖండ్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కొత్త కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం 91,361 (0.26%) మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కొత్తగా మరో 7,585 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,42,66,363 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.36 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.38 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (డిసెంబర్ 31, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 67,78,78,255
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 3,48,38,804
- కొత్తగా నమోదైన కేసులు [ డిసెంబర్ 30–డిసెంబర్ 31 (8AM-8AM)] : 16,764
- నమోదైన మరణాలు : 220
- రికవరీ అయిన వారి సంఖ్య : 3,42,66,363
- యాక్టీవ్ కేసులు : 91,361
- మొత్తం మరణాల సంఖ్య : 4,81,080
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ