ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 91,849 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 4458 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 909, చిత్తూరులో 708 నమోదయ్యాయి. దీంతో జూన్ 25, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,71,475 కు చేరింది. కరోనా వలన రాష్ట్రంలో మరో 38 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 12528 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 6313 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 18,11,157 కు పెరిగింది. ప్రస్తుతం 47,790 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(4458):
- నెల్లూరు – 212
- తూర్పుగోదావరి – 909
- గుంటూరు – 239
- విశాఖపట్నం – 198
- శ్రీకాకుళం – 151
- చిత్తూరు – 708
- కర్నూల్ – 126
- విజయనగరం – 64
- ప్రకాశం – 335
- కడప – 370
- అనంతపూర్ – 224
- కృష్ణా – 331
- పశ్చిమగోదావరి – 591
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ