దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గురువారం ఉదయానికి ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 961 ఉండగా, ఒక్కరోజు వ్యవధిలోనే కొత్తగా 309 కేసులు నమోదవడంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1270కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ఇప్పటివరకు మొత్తం 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైయినట్టు తెలిపారు.
అత్యధికంగా మహారాష్ట్రలో 450 ఒమిక్రాన్ కేసులు నమోదవగా, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్ లో 97, రాజస్థాన్ లో 69, తెలంగాణలో 67, తమిళనాడులో 46, కర్ణాటకలో 34, ఆంధ్రప్రదేశ్ లో 16, హర్యానాలో 14, ఒడిశాలో 14, వెస్ట్ బెంగాల్ లో 11, మధ్యప్రదేశ్ లో 9, ఉత్తరాఖండ్ లో 4, చండీఘర్ లో 3, జమ్మూ కాశ్మీర్ లో 3, అండమాన్ అండ్ నికోబార్ లో 2, ఉత్తర్ ప్రదేశ్ లో 2, గోవాలో 1, హిమాచల్ ప్రదేశ్ లో 1, లద్దాఖ్ లో 1, మణిపూర్ లో 1, పంజాబ్ లో 1 నమోదయ్యాయి. కాగా మొత్తం 1270 బాధితుల్లో ఇప్పటికే 374 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ