దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 10,584 కరోనా పాజిటివ్ కేసులు, 78 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,16,434 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,56,463 కి పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పంజాబ్, కర్ణాటక, గుజరాత్ వంటి 6 రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,47,306 (1.34%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 13,255 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,07,12,665 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.24 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.42 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు:
కాగా గత 24 గంటల్లో మధ్యప్రదేశ్, అస్సాం, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, లక్షద్వీప్, మణిపూర్, సిక్కిం, త్రిపుర, లద్దాఖ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఫిబ్రవరి 23, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 21,22,30,431
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,10,16,434
- కొత్తగా నమోదైన కేసులు [ఫిబ్రవరి 22–ఫిబ్రవరి 23 (8AM-8AM)] : 10,584
- నమోదైన మరణాలు : 78
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,07,12,665
- యాక్టీవ్ కేసులు : 1,47,306
- మొత్తం మరణాల సంఖ్య : 1,56,463
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ