దేశంలో నవంబర్ 23, సోమవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91,39,865 కు చేరుకుంది. గత నెలలతో పోల్చితే దేశంలో పాజిటివ్ కేసుల నమోదు కొంచెం తగ్గుముఖం పట్టినా, కరోనా సెకండ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం ఎక్కువుగా ఉన్న వివిధ రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో నవంబర్ 24, మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా జరిగే ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు వైద్యం అందుతున్న తీరు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, కరోనా సెకండ్ వేవ్ కు సన్నద్ధత తదితర అంశాలపై కీలకంగా చర్చించే అవకాశమునట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ