దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,649 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,16,589 కు చేరుకుంది. కరోనాతో మరో 90 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,55,732 కి పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసులు 1,39,637 (1.28%) కు తగ్గాయి. ప్రస్తుతం 33 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 5,000 కంటే తక్కువగానే యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే గత 24 గంటల్లో 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
ఇక కొత్తగా 9,489 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 1,06,21,220 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 97.29 శాతం గానూ, మరణాల రేటు 1.43 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైన 11,649 కేసులలో 86.4 శాతం ఈ 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ