దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 12143 కరోనా కేసులు, 103 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,92,746 కు, మరణాల సంఖ్య 1,55,550 కు చేరుకుంది. దేశంలో హోమ్ ఐసొలేషన్స్ మరియు ఆసుపత్రుల్లో 1,36,571 (1.25%) మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. అలాగే గత 24 గంటల్లో 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
మరోవైపు కొత్తగా 11,395 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,06,00,625 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 97.32 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.43 శాతంగా ఉంది. ఫిబ్రవరి 12 నాటికీ దేశవ్యాప్తంగా 20,55,33,398 కరోనా పరీక్షలు నిర్వహించగా, గత 24 గంటల్లో 7,43,614 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో అత్యధికంగా కేరళలో 5397, మహారాష్ట్రలో 3670, తమిళనాడులో 483, కర్ణాటకలో 380, గుజరాత్ లో 268, పంజాబ్ 246 కేసులు నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ