దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 17,921 కరోనా పాజిటివ్ కేసులు, 133 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,62,707 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,58,063 కి పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు వంటి 6 రాష్ట్రాలలోనే గత 24 గంటల్లో కొత్త కేసులు పెరిగాయి. దేశంలో ప్రస్తుతం 1,84,598 (1.64%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు గత ౨౪ గంటల్లో రికార్డ్ స్థాయిలో 20,652 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,09,20,046 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 96.96 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.40 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు:
కాగా గత 24 గంటల్లో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, చండీగర్, ఒడిశా, ఉత్తరాఖండ్, జార్ఖండ్, బీహార్, పుదుచ్చేరి, లక్షద్వీప్, సిక్కిం, లద్దాఖ్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (మార్చి 10, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 22,34,79,877
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 1,12,62,707
- కొత్తగా నమోదైన కేసులు [మార్చి 9–మార్చి 10 (8AM-8AM)] : 17,921
- నమోదైన మరణాలు : 133
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,09,20,046
- యాక్టీవ్ కేసులు : 1,84,598
- మొత్తం మరణాల సంఖ్య : 1,58,063
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ