దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వచ్చింది. గత 24 గంటల్లో 3 వేలలోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2,424 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 10, సోమళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,14,437 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 15 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,28,814 కి పెరిగింది. ఇక అక్టోబర్ 9, ఆదివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 89.71 కోట్లకు చేరుకుంది. అక్టోబర్ 9న 91,458 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 2.65 శాతంగా నమోదైంది.
దేశంలో 28,079 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.75 శాతం:
దేశంలో ప్రస్తుతం 28,079 (0.06%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 2,923 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,40,57,544 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY