దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజువారిగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,95,041 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,56,16,130 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 2023 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,82,553 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 21,57,538 (13.82%) యాక్టీవ్ కేసుల ఉన్నాయి. కొత్తగా మహారాష్ట్ర (62,097), ఉత్తర్ ప్రదేశ్ (29,574), ఢిల్లీ (28,395), కర్ణాటక (21794), కేరళ (19577), ఛత్తీస్ గడ్ (15625), మధ్యప్రదేశ్ (12727), గుజరాత్ (12206), రాజస్థాన్ (12201), తమిళనాడు (10986) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2,95,041 కేసులలో 76.32% శాతం ఈ 10 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి
దేశంలో కరోనా రికవరీ రేటు 85.01 శాతం, మరణాల రేటు 1.17 శాతం:
దేశంలో మరో 1,67,457 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 1,32,76,039 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 85.01 శాతం గానూ, మరణాల రేటు 1.17 శాతంగా ఉంది. అలాగే గత 24 గంటల్లో మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మిజోరం, లక్షద్వీప్, నాగాలాండ్,, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబర్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 9 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ