ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థులు 6 స్థానాల్లో, మిగిలిన చోట్ల బీజేపీ పార్టీ అభ్యర్థులు పోటీకి సిద్ధమయినట్టుగా బుధవారం నాడు జనసేన పార్టీ ప్రకటించింది. 23, 48, 28, 16, 8, 51 డివిజన్లు జనసేన పార్టీకి కేటాయించినట్టు తెలిపారు. ఖమ్మం నగరంలోని 60 డివిజన్లలో ఇరు పార్టీల శ్రేణులు పరస్పర సమన్వయంతో గెలుపు కోసం కృషి చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారని తెలిపారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీలో ఉన్న జనసేన అభ్యర్థులు వీరే:
1. మిరియాల జగన్- 23వ డివిజన్
2. ధనిశెట్టి భానుమతి- 48వ డివిజన్
3. భోగా హరిప్రియ- 28వ డివిజన్
4. బండారు రామకృష్ణ- 16వ డివిజన్
5. బోడా వినోద్- 8వ డివిజన్
6. సింగారపు చంద్రమౌళి- 51వ డివిజన్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ