దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. రెండ్రోజులుగా 40 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 31,118 కేసులు నమోదు కావడంతో డిసెంబర్ 1, మంగళవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 94,62,809 కు చేరుకుంది. కరోనాతో మరో 482 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,37,621 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే 88 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఒకేరోజులో 41,985 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 88,89,585 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 93.94 శాతం గానూ, మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 4,35,603 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, గుజరాత్, తమిళనాడు మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా నమోదైనా 31,118 కేసులలో 77.79 శాతం ఈ 10 రాష్ట్రాలలో నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ