దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 400 లోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 389 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 26, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,71,219 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో నలుగురు మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,608కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు కొంత ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 5,395 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.80 శాతం:
దేశంలో ప్రస్తుతం 5,395 (0.01%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 506 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,35,216 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇక నవంబర్ 25న 2,83,081 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.14 శాతంగా నమోదైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE