దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కరోనా మరణాలు, యాక్టీవ్ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 38,949 కేసులు, 542 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,26,829 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,12,531 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, అస్సాం, కర్ణాటక, మణిపూర్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ వంటి 10 రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 40,026 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,01,83,876 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.28 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.33 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలివే (జూలై 15 8am–జూలై 16 8am):
- కేరళ – 13773
- మహారాష్ట్ర – 8010
- ఆంధ్రప్రదేశ్ – 2526
- తమిళనాడు – 2405
- ఒడిశా – 2110
- అస్సాం – 1992
- కర్ణాటక – 1977
- మణిపూర్ – 1039
- వెస్ట్ బెంగాల్ – 891
- తెలంగాణ – 710
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ